మహబూబ్ నగర్ : ఎక్కడైనా పెండ్లి బృదం డీసీఎం వ్యాన్ లేదా బస్సులో పెండ్లి మండపానికి వెళ్తారు. కానీ వనపర్తి జిల్లాకు చెందిన పెండ్లి వారు విచిత్రంగా పోలీసు వాహనంలో వివాహం జరిగే గ్రామానికి చేరింది. మహబూబ్ నగర్ వన్ టౌన్ సీఐ రాజేశ్వర్ గౌడ్ స్వయంగా పెండ్లి బృందాన్ని పోలీసు వాహనంలో గమ్యస్థానానికి చేర్చి అందరి అభినందనలు అందుకుంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలం అల్లమాయపల్లికి చెందిన యువతికి మహబూబ్ నగర్ పట్టణానికి సమీపంలో ఉన్న బోయపల్లి గ్రామానికి చెందిన యువకుడితో ఆదివారం ఉదయం వివాహం జరుగాల్సి ఉంది. ఈ క్రమంలో పెండ్లి కూతురు తరపు బంధువులు ఓ వాహనంలో పెండ్లి బయల్దేరడానికి వెళ్లారు. మహబూబ్ నగర్ పట్టణంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా ఆ వాహనంలో 30 మంది వరకు ఉండడంతో అందరినీ దించి వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా పెండ్లి తంతులో ప్రధాన భూమికను పోషించే వలసిన పెండ్లి కూతురు తల్లిదండ్రులు ఇక్కడే ఉండడం, పెండ్లికి అవసరమైన తాళిబొట్టు, తదితర సామగ్రి సైతం వీరి దగ్గరే ఉన్నాయని పోలీసులు గుర్తించారు.
ఈ పరిస్థితిని గుర్తించిన సీఐ రాజేశ్వర్ గౌడ్ పెండ్లి ఆటంకాలు కలగకూడదనే ఉద్దేశంతో పోలీసు వాహనంలో పెండ్లి కూతురు తల్లిదండ్రులను పంపారు. వివాహానికి ఆటంకాలు కలుగకుండా సహకరించిన సీఐకి అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పోలీసులమని బెదిరించి.. బంగారం దోచుకెళ్లిన దుండగులు
దారుణం : హత్యకు దారి తీసిన భూ తగాదా
బాధ్యతగా పని చేయండి : మంత్రి హరీశ్ రావు
ఇలాగైతే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ను రద్దు చేస్తాం
నెక్కొండ పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది
యాదాద్రిలో ప్రారంభమైన నృసింహుడి జయం