రామగిరి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ బొగ్గు గనుల వేలం వేస్తుందని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం అర్జీ-3 ఓసీపీ-2 గేట్ మీటింగ్లో పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.
బీజేపీ సర్కారు తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ సింగరేణి కార్మిక లోకం అంతా సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడే వరకు ఉద్యమిస్తామన్నారు. డిసెంబర్ 9 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమ్మెలో మరిన్ని డిమాండ్లను చేర్చడంతో పాటుగా బీజేపీ సర్కార్ దిగి వచ్చేంత వరకూ పోరాటం ఆగదన్నారు.
సింగరేణి సంస్థకు చెందిన నాలుగు బొగ్గు బ్లాకులు కళ్యాణి ఖని బ్లాక్-6, కోయగూడెం బ్లాక్-3, సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణ్ పల్లి బ్లాక్ లను వేలం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు చేస్తున్న చర్యలను టిబిజికెఎస్ తో పాటు 5 జాతీయ కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు.
బీజీపీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా టీబీజీకేఎస్ ఉద్యమబాట పట్టిందని వివరించారు. కార్మిక సంఘాలు ఉమ్మడి కార్యాచరణతో కేంద్రం దిగి వచ్చేంత వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
ఇండియాలో ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదు: రాజ్యసభలో ఆరోగ్యశాఖ మంత్రి
Electric shock | కరెంట్ షాక్తో ఎలక్ట్రీషియన్ మృతి
కేంద్ర మంత్రులు చెప్పేవన్నీ అబద్ధాలే : మంత్రి హరీశ్రావు