సంగారెడ్డి : జిల్లాలోని నారాయణ ఖేడ్ ఏరియా దవాఖానను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మంగళవారం ఆకస్మింగా తనిఖీ చేశారు. దవాఖానలో రోగులతో మాట్లాడి వైద్య సేవల పై ఆరా తీశారు. పలువురు సిబ్బంది గైర్హాజరు కావడంపై సూపరింటెండెంట్ నర్సింగ్ చౌహాన్ను మందలింలించారు.
మళ్లీ ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదని హెచ్చరించారు. అలాగే రక్త నిధి, ఆక్సిజన్ ప్లాంట్, ఎక్స్ రే విభాగాలను మంత్రి పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అన్ని సదుపాయాలు కల్పించామని వారిటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఒకరిద్దరు వైద్యులను ఇతర దవాఖానలకు డిప్యుటేషన్పై వెళ్లడమేంటని ప్రశ్నించారు. రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.