మంచిర్యాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘంతో ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..దండేపల్లి మండలం లింగాపూర్ సమీపంలో ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మడావి లక్ష్మణ్ (26) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో మృతి చెందాడు.
బాధిత కుటుంబీకులు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతిడికి భార్య ఆమని, ఒక పాప ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇండియాలో ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదు: రాజ్యసభలో ఆరోగ్యశాఖ మంత్రి
రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల వాకౌట్
కేంద్ర మంత్రులు చెప్పేవన్నీ అబద్ధాలే : మంత్రి హరీశ్రావు