న్యూఢిల్లీ : కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఆయన ఆదివారం మాట్లాడుతూ.. పేపర్ లీకులపై జెన్-జీని తప్పుదోవ పట్టించారనిఅందుకే తాను రాజీనామా చేశానన్నారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ఆయన ఆ పదవిలో ఉన్నారు కాబట్టే విద్యార్థులు జవాబుదారీతనంగా రాజీనామా చేయమని అడిగారని అందులో తప్పుదోవ పట్టించేది ఏముందన్నారు.
ఆప్ నేత సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. పేపర్ లీక్ జరిగి 21 మంది విద్యార్థులు చనిపోతే రాజీనామా చేయమనడం తప్పుదోవ పట్టించడం ఎలా అవుతుందని విమర్శించారు. ‘జెన్-జీపై బీజేపీ అబద్ధాలను ఎండగట్టారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం బీజేపీకే అలవాటు’ అని శివసేన (యూటీబీ) నేత అరవింద్ సావంత్ చెప్పారు.