భద్రాద్రి కొత్తగూడెం : రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్ అన్నారు. బుధవారం భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాల్లో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి విస్తృతంగా పర్యటించి రైతువేదికలు, ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు గత ప్రభుత్వాల హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారన్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధరను కల్పించి రైతులకు భరోసా కల్పిస్తుందన్నారు. రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్నదన్నారు. రైతువేదికలు రైతుల పాలిట దేవాలయాలన్నారు. తాజాగా రూ.50 వేల వరకు రుణాలు తీసుకున్నవారి రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిందన్నారు.
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా పల్లెలు, పట్టణాలు అభివృద్ధి బాట పట్టాయన్నారు. కార్యక్రమాలోల డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Wanaparthi : అది పులి కాదు..పునుగు పిల్లి
భర్త వద్దంటే పనికి వెళ్లాడని భార్య ఆత్మహత్య
ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచారయత్నం కేసు
దారుణం : రైల్వే ట్రాక్పై యువతి మృతదేహం
Road accident |బొలెరో వాహనం బోల్తా..పది మందికి గాయాలు