హైదరాబాద్ : అల్వాల్ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. నిన్న ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ఓ యువతి బీహెచ్ఈఎల్ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్పై శవమై కనిపించడం స్థానికంగా కలకలం రేపంది. మృతురాలు సరస్వతిని ఉరి వేసి హత్య చేసి రైల్వే ట్రాక్పై పడేసినట్లు తెలుస్తున్నది. కాగా, మృతురాలు బోయినపల్లి ఒమేగా కాలేజీలో డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. సరస్వతి రాత్రయినా ఇంటికి రాకపోవడంతో మంగళవారం బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.