వరంగల్ రూరల్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారిలో దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామం వద్ద కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పదిమంది కూలీలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు 108 వాహనం ద్వారా దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచారయత్నం కేసు
దారుణం : రైల్వే ట్రాక్పై యువతి మృతదేహం
Molest and Murder | వారికి అండగా నిలబడుతా: రాహుల్గాంధీ