Harish Rao | హైదరాబాద్ : సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు గురువారం సాయంత్రం పరామర్శించారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్ను పలుకరించి, ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. శ్రీతేజ్కు మెరుగైన వైద్యం అందిస్తున్నామని కిమ్స్ వైద్యులు చెప్పారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆ భవగవంతుడిని ప్రార్థిస్తున్నాను. రేవతి ఆత్మకు శాంతి చేకూరాలి.. ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలి. సినిమా వాళ్లను భయపెట్టి సీఎం రేవంత్ మంచి చేసుకోకూడదు. ఈ ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. గురుకులాల్లో మృతి చెందిన పిల్లల కుటుంబ సభ్యులను సీఎం రేవంత్ ఇంత వరకు పరామర్శించలేదు. ఓ సర్పంచ్ ఆత్మహత్యకు కారకుడైన సీఎం సోదరుడిని ఎందుకు అరెస్టు చేయలేదు. చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి.
శ్రీతేజ్ను పరామర్శించిన వారిలో కేపీ వివేకానంద, బండారు లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, నవీన్ కుమార్తో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Errolla Srinivas | బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్కు బెయిల్ మంజూరు
MLC Kavitha | బీసీలంటే లెక్క లేదా..? బీసీ కులగణనపై బీజేపీ వైఖరి చెప్పాలి.. ఎమ్మెల్సీ కవిత డిమాండ్