Harish Rao | హైదరాబాద్ : రేవంత్ పాలనలో గురుకులాలు అస్తవ్యస్తంగా మారాయి. ఫుడ్ పాయిజన్, పాముకాట్లతో విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా కేతెపల్లి మండల పరిధిలోని బీసీ గురుకులంలో ఓ విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు.
ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రంగా స్పందించారు. నల్లగొండ జిల్లాలో పాము కాటుకు గురై మరో గురుకుల విద్యార్థి ఆసుపత్రి పాలైన వార్త తీవ్రంగా కలిచివేసింది. కాంగ్రెస్ పాలనలో బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రుల్లో చేరుతుండడం సిగ్గుచేటు. గురుకులాల్లో కుక్కకాట్లు, ఎలుక కాట్లు, పాము కాట్లు సాధారణంగా మారడం దురదృష్టకరం. విద్యాశాఖ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు తన వద్దనే ఉన్నా ముఖ్యమంత్రి ఏనాడు సమీక్ష చేయడని హరీశ్రావు మండిపడ్డారు.
పురుగులన్నం తినలేక విద్యార్థులు ఆకలితో అలమటించినా పట్టించుకోడు. ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు ఆస్పత్రుల పాలైన పట్టించుకోడు. టీచర్లు కావాలంటూ విద్యార్థులు రోడ్డెక్కినా పట్టించుకోడు. పాముకాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లు, కరెంటు షాకులతో ఆసుపత్రుల పాలైనా పట్టించుకోడు. మీ 11నెలల కాలంలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని ఎన్నిసార్లు మొత్తుకున్నా పట్టించుకోడు. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం ఖరీదు 42 మంది విద్యార్థుల ప్రాణాలు. విద్యాశాఖ ప్రక్షాళన అంటూ ప్రగల్భాలు పలకడం కాదు రేవంత్ రెడ్డి.. గురుకులాల్లో కనీస సౌకర్యాలు కల్పించి, విద్యాబోధన జరిగేలా చూడండి. అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలు కాపాడండి అని హరీశ్రావు కోరారు.
ఇవి కూడా చదవండి..
Revanth Reddy | నాడు ముక్కలు .. నేడు తొక్కుడు.. సీఎం రేవంత్ భాషపై విమర్శల వెల్లువ
Revanth Reddy | రేవంత్ నోట మళ్లీ అబద్ధాలు.. రూ.7 లక్షల కోట్ల అప్పని దుష్ప్రచారం
Congress Party | ఓరుగల్లు సభకు ముగ్గురు మంత్రులు డుమ్మా.. కాంగ్రెస్ సభలా సర్కారు ప్రోగ్రాం