సిద్దిపేట : చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరు ధరించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC) లో సిద్దిపేట చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాల స్టాల్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఉంచిన చేనేత వస్త్రాల ను పరిశీలించారు. వాటి ప్రత్యేకతలు, ధరల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉద్యానవన అధికారికి చీరను బహూకరించిన మంత్రి జిల్లా ఉద్యానవన అధికారి రామ లక్ష్మికి మంత్రి హరీశ్రావు చీరను బహూకరించారు.
సిద్దిపేట జిల్లాకు ఆయిల్ ఫామ్, సెరీ కల్చర్ సాగులో ప్రభుత్వం నిర్ధేంశించిన లక్ష్యాల సాధనకు అవిశ్రాంతం గా కృషి చేస్తున్నందుకు గుర్తింపుగా ఆమెకు చీరను బహూకరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి వెంకట్రామ్ రెడ్డి, స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, చేనేత, జౌళి శాఖ జిల్లా సహాయ సంచాలకులు వెంకట రమణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆ పై తాను తాగి..
Suryakumar Yadav: ఇంగ్లండ్ బయలుదేరిన సూర్యకుమార్ యాదవ్
రామప్పను సందర్శించిన మంత్రులు, పురావస్తు శాఖ అధికారులు
జడ్చర్లలో భారీగా గుట్కా పట్టివేత
మహబూబాబాద్ జిల్లాలో 120 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత