కామారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి అల్లారు ముద్దుగా పెంచుకున్న తన ఇద్దరు బిడ్డలకు జ్యూస్లో విషమిచ్చి తాను తాగి మృతి చెందింది. గుండెలను పిండేసే ఈ సంఘటన ఎల్లారెడ్డి మండలం సోమరిగా తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన హన్సీ అనే మహిళ కుటుంబ కలహాలతో తన ఇద్దరు బిడ్డలకు జ్యూస్ లో విషమిచ్చి తాను తాగింది. ఈ ఘటనలో తల్లి మరణించగా.. పిల్లలు పూజ, నందుకు కామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. హన్సీ మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి విరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Suryakumar Yadav: ఇంగ్లండ్ బయలుదేరిన సూర్యకుమార్ యాదవ్
రామప్పను సందర్శించిన మంత్రులు, పురావస్తు శాఖ అధికారులు
జడ్చర్లలో భారీగా గుట్కా పట్టివేత
మహబూబాబాద్ జిల్లాలో 120 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత