హైదరాబాద్ : సిమెంటుకు గిరాకీ భారీగా పడిపోవడంతో దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంట్ తయారీ కంపెనీలు ధరలను తగ్గించాయి. 50 కిలోల బస్తాపై రూ.20-40 వరకు తగ్గించినట్లు డీలర్లు తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో బస్తాకు రూ.40 వరకు, తమిళనాడులో రూ.20 దాకా కోతలు పడ్డాయి. కేరళ, కర్ణాటకల్లోనూ రూ.20-40 వరకు కోత విధించారు.
ఈ ధరల తగ్గింపు నేపథ్యంలో 50 కిలోల బస్తా తెలుగు రాష్ట్రాల్లో రూ.280-320కి పరిమితం కానుంది. తమిళనాడులో ఒక టాప్ బ్రాండ్ సిమెంటు ధర రూ.400 దిగువకు, కర్ణాటక, కేరళల్లోనూ బస్తా ధర రూ.360-400 నుంచి రూ.340-380కి చేరినట్లు డీలర్లు వివరించారు.
ఇవి కూడా చదవండి..
డయల్ 100తో తక్షణ స్పందన..బాలుడిని తల్లి ఒడికి చేర్చిన పోలీసులు
Tiger attack | జయశంకర్ జిల్లాలో బర్రెల మందపై పులి దాడి..భయాందోళనలో గ్రామస్తులు
అయ్యప్ప మాలధారణతో దొంగతనాలు..దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
Crime news | వేటగాళ్ల ఉచ్చుకు తండ్రి, కొడుకు మృతి..మరొకరికి గాయాలు