వనపర్తి : యాదవుల బలోపేతం చేయడానికే గొర్రెల పంపిణీని చేపట్టామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తిలో జరిగిన గొర్రెల పెంపకందారుల సహకర యూనియన్ లిమిటెడ్ సమావేశంలో మంత్రి మాట్లాడారు. కొంతమంది గొర్రెలు ఇస్తే విమర్శిస్తున్నారు. ఇది వృత్తిని కించపర్చడమే అన్నారు. ఆగస్టు 15 వరకు రెండో విడత గొర్రెలను పంపిణీ చేస్తామన్నారు.
యాదవులు గొప్పగా ఎదుగాలనే సంకల్పతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
సమాజ సంపదను పెంచడంలో భాగంగా గొర్రెల పంపిణీ ఉంటుందన్నారు. ఎదగాలని ఉన్న ప్రతి వర్గానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచారయత్నం కేసు
దారుణం : రైల్వే ట్రాక్పై యువతి మృతదేహం
Road accident |బొలెరో వాహనం బోల్తా..పది మందికి గాయాలు