హైదరాబాద్ : ప్రభుత్వ విప్,చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, టీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్ పైన ఉన్న తెలంగాణ ఉద్యమ కేసును నాంపల్లి ఎంపీ, ఎమ్మెల్యే కోర్ట్ న్యాయమూర్తి కె.జయకుమార్ కొట్టివేశారు.
కేసును వాదించిన న్యాయవాదుల్లో ఒకరైన జక్కుల లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. 2009 లాలాగుడ పోలీస్ స్టేషన్ పరిధి తార్నాకలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలు బాల్క సుమన్, రాజారాం యాదవ్ తదితరులు తెలంగాణ బంద్ సందర్భంగా నినాదాలు చేస్తూ పెట్రోల్ పంపులో అద్దాలు పగలగొట్టారని లాలగూడ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుని న్యాయమూర్తి విచారించారు.
ఈ మేరకు ఎంపీ, ఎమ్మెల్యే కోర్ట్ న్యాయమూర్తి కె.విజయ్ కుమార్ శుక్రవారం నాటి కేసును కొట్టివేశారు. ఈ కేసుని జి.కిరణ్ కుమార్, జక్కుల లక్ష్మణ్, శ్రీనాథ్, జి.రాము తదితర న్యాయవాదులు వాదించారు.
ఇవి కూడా చదవండి..
Road accident | జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Sangareddy | ట్రైనీ నర్స్ను లైంగికంగా వేధించిన వైద్యుడి సస్పెన్షన్
సంగారెడ్డి జిల్లాలో విషాదం.. కలహాలతో కుటుంబం ఆత్మహత్య
Corona | జగిత్యాల పట్టణంలో ఏడో తరగతి విద్యార్థికి కరోనా