జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని చైతన్య స్కూల్లో ఏడో తరగతి విద్యార్థికి కరోనా పాజిటివ్గా తేలింది. పాఠశాలలో మొత్తం 600 మంది విద్యార్థులు ఉండగా ఏడో తరగతిలో 21 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో వైద్యాధికారి సూచనల మేరకు ఏడోతరగతి విద్యార్థులకు మూడు రోజులు సెలవు ప్రకటించినట్టు ప్రిన్సిపాల్ సచిన్ తెలిపారు. తల్లిదండ్రులు విద్యార్థులను హోం క్వారంటైన్లో ఉంచి తగు జాగ్రత్త తీసుకోవాలని వైద్యులు సూచించారు.