సంగారెడ్డి : ట్రైనీ నర్స్ను లైంగిక వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న నారాయణఖేడ్ ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ నర్సింగ్ చౌహాన్ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని నారాయణఖేడ్ ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ నర్సింగ్ చౌహన్ను ట్రెనింగ్ నర్సుగా విధులు నిర్వహిస్తున్న మహిళను డిసెంబర్ 1న తన ఛాంబర్ కు తీసుకెళ్లి వ్యక్తిగత విషయాలు అడిగి తెలుసుకున్నాడు.
నేను వరుసకు నీకు బావ అవుతానని చెంపలపై చేయివేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో దవాఖాన ఆవరణలోనే సదరు వైద్యుడికి దేహశుద్ధి చేశారు.