న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రూ.47 వేల మార్కును దాటిన బంగారం ధర ఇవాళ మళ్లీ దిగి వచ్చింది. ఢిల్లీలో మంగళవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.305 తగ్గి రూ.46,756కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,061 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాలకు డిమాండ్ స్వల్పంగా తగ్గడం, అమెరికన్ డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువు కొంద పెరుగడం కూడా దేశీయంగా బంగారం ధర స్వల్పంగా తగ్గడానికి కారణమైందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక వెండ ధర కూడా ఇవాళ స్వల్పంగా తగ్గింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.113 తగ్గి రూ.67,810కి దిగి వచ్చింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.67,923 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,768 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 25.90 అమెరికన్ డాలర్లు పలికింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి.
మునక్కాయల కన్న మునగాకే మిన్న..!
వేసవిలో శరీరాన్ని చల్లబరిచే ఈ పానీయాలు తీసుకోవాలి..!
కేంద్రమంత్రి జితేంద్రసింగ్కు కరోనా
మే 1 వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ