న్యూఢిల్లీ: దేశంలో కరోనా కరాళ నృత్యం కొనసాగుతన్నది. సామాన్యులేగాక పలువురు సినీ, రాజకీయరంగ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారినపడి విలవిల్లాడుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న జితేంద్రసింగ్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని జితేంద్రసింగ్ మీడియాకు వెల్లడించారు.
తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, తనలో కరోనా సింప్టమ్స్ కూడా ఉన్నాయని జితేంద్రసింగ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. అందుకే ఇటీవల తనను కలిసిన వారందరూ దయచేసి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, కొన్ని రోజులపాటు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని ఆయన కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి.
మునక్కాయల కన్న మునగాకే మిన్న..!
మే 1 వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ
సంచలన నిర్ణయం తీసుకున్న ఛార్మీ
ఐసీఎస్ఈ 10వ బోర్డు పరీక్షలు రద్దు..
వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం ఎత్తివేత!