Massive fire | బీహార్ రాజధాని పాట్నాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది (Fire). పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్ (Patna Railway station) సమీపంలోని ఓ హోటల్లో గురువారం ఉదయం ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో సుమారు ఆరు మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
పాట్నాలోని రైల్వే జంక్షన్ ఎదురుగా ఉన్న పాల్ హోటల్ భవనంలో మంటలు చెలరేగినట్లు ఉదయం 11 గంటలకు తమకు సమాచారం అందినట్లు అగ్నిమాపక శాఖ డీఐజీ మృత్యుంజయ్ కుమార్ తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. హోటల్ నుంచి సుమారుగా 20 మందిని కాపాడినట్లు తెలిపారు. సిలిండ్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
Jio Cinema | జియో సినిమా బంపర్ ఆఫర్.. రూ.29కే నెల మొత్తం 4K వీడియో క్వాలిటీతో యాడ్ ఫ్రీ కంటెంట్
Election Commission | మోదీ, రాహుల్ ప్రసంగాలపై ఈసీ అసహనం.. రెండు పార్టీలకూ నోటీసులు
Madhavi Latha | రూ.218 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించిన బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత