KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సర్కార్.. గురుకుల విద్యాసంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ భవిష్యత్ అయిన భావితరాలకు శాపంగా మారిందని విమర్శించారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాలు.. ఏడాది కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమై అధ్వాన్న స్థితికి చేరాయని కేటీఆర్ పేర్కొన్నారు. నాడు డాక్టర్లు, ఇంజనీర్ వంటి ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు.. నేడు సరైన దిశానిర్దేశం లేక ధీన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. నాడు గురుకులాల్లో సీటు కోసం పోటీ పడిన విద్యార్థులు.. నేడు గురుకులం పేరు చెబితే డీలా పడిపోతున్నారు. నాడు కడుపునిండా అన్నం తిని, అనుకున్న లక్ష్యాలను సాధిస్తే…నేడు అన్నమో రామచంద్ర అనే రోజులొచ్చాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
నాడు 41 వేల సీట్లకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాసేందుకు లక్షా 68 వేల దరఖాస్తులు వస్తే.. నేడు 51 వేల సీట్లకు గాను
80 వేల దరఖాస్తులే వచ్చాయి. ఏడాది పాలనలో 50కి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్, ఇతర కారణాలతో మరణించినా
కాంగ్రెస్ సర్కారులో కనీస చలనం లేదు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కనీస పరామర్శ లేకపోగా.. అంత్యక్రియలకు, పరామర్శకు వెళ్లే ప్రతిపక్షం మీద ఈ ప్రభుత్వం నిర్భంధం ప్రయోగిస్తున్నది అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాగో తెలంగాణ జాగో! అని కేటీఆర్ నినదించారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో
ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాలుఏడాది కాంగ్రెస్ పాలనలో
అస్తవ్యస్తమై అధ్వాన్న స్థితికి చేరాయి.నాడు డాక్టర్లు, ఇంజనీర్ వంటి ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు
నేడు సరైన దిశానిర్దేశం లేక
దీన పరిస్థితి ఎదుర్కొంటున్నారు.నాడు గురుకులాల్లో సీటు కోసం… pic.twitter.com/LLjDPGGcoz
— KTR (@KTRBRS) February 16, 2025
ఇవి కూడా చదవండి..
KTR | ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
Telangana | 5 లక్షల బీమా ఉన్నట్టా? లేనట్టా? పథకాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం
Telangana | గౌడన్నల మెడపై ఎక్సైజ్ కత్తి! అక్రమ కేసులు బనాయిస్తున్న ఎక్సైజ్, నార్కోటిక్ బ్యూరో