KTR | హైదరాబాద్ : హైడ్రా పేరిట నిరుపేదల ఇండ్లను కూలగొడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదల ఇండ్ల మీదకు వెళ్లినట్లు.. మీ అన్న తిరుపతి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి మీదికి బుల్డోజర్ను పంపించే ధైర్యం మీకు ఉందా..? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు.
ఉన్న ఒక గూటినీ మీ బుల్డోజర్ ప్రభుత్వం కూల్చివేస్తే, కడుపుమండి, కన్నీళ్ళతో కిరసనాయిలు పోసుకున్నందుకు కేసులు పెడతారా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఎంత సిగ్గుచేటు, ఎంతటి నీతిమాలిన చర్య, మీది ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన కాదు రేవంత్ రెడ్డి, మీరు నడుపుతున్నది బుల్డోజర్ ప్రభుత్వం! కేసుల రాజ్యమంటూ తీవ్ర స్థాయిలో ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అన్న తిరుపతి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్ల మీదికి బుల్డోజర్ను పంపించే ధైర్యం మీకు ఉందా..? అని రేవంత్ను కేటీఆర్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
Nateshwara Sharma | దాశరథి అవార్డు గ్రహీత నటేశ్వర శర్మ కన్నుమూత
KTR | పసిపాప కన్నీళ్లు చూసైనా.. సర్కార్కు కనికరం కలగలేదా..! : కేటీఆర్
KTR | మంచి నీళ్లను కూడా వదలట్లేదు.. ఆ పథకాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ సర్కార్ : కేటీఆర్