Harish Rao | హైదరాబాద్ : శాసనసభను పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించడంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ అనుమతితో మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడారు.
సమయం 10:10 కావొచ్చింది. ఈ సెషన్లో ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీ పది అంటే పది గంటలకు ప్రారంభం కాలేదు. మీరు లాస్ట్ సెషన్ చూడండి.. పదేండ్లు సభ నడిపితే.. పది అంటే పది గంటలకు కచ్చితంగా ఠంచన్గా సభ నడిపాం. సభ సమయ పాలన పాటించడం ముఖ్యం. ప్రతి రోజు ఈ సెషన్లో 5, 10, 15 నిమిషాలు ఆలస్యంగా సభ ప్రారంభం కావడం కరెక్ట్ కాదు. సభ అందరికీ ఆదర్శంగా ఉండాలి. మనమే ఇలా ఆలస్యంగా నడపడం కరెక్ట్ కాదని మనవి చేస్తున్నానని హరీశ్రావు పేర్కొన్నారు.
అనంతరం స్పీకర్ అనుమతితో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ ప్రారంభించారు. రైతు భరోసా విధివిధానాలపై సూచనలు ఇవ్వాలని మంత్రి తుమ్మల సభ్యులను కోరారు. సంక్రాంతి పండుగ నాటికి రైతు భరోసాపై విధివిధానాలను ఖరారు చేసి, ఆ తర్వాత రైతు భరోసా చెల్లింపులు చేస్తామని మంత్రి ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
Lagacharla | మళ్లీ రైతుల అరెస్టుకు ప్లాన్? తండాల్లో తాండవిస్తున్న భయానక వాతావరణం
MLC Kodandaram | ఇదీ అఫిడవిట్టేనా.. ఎమ్మెల్సీ కోదండరాంపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం
Assembly | విపక్షాలకు మైక్ కట్.. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులకు అడుగడుగునా ఆంక్షలే..