దుబ్బాక/సిద్దిపేట : నిరు పేదలకు ఖరీదైన వైద్య ఖర్చులకు సీఎంఆర్ఎఫ్( ముఖ్యమంత్రి సహాయ నిధి) అండగా నిలుస్తుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం దుబ్బాక మండలం పోతారం గ్రామంలో నియోజకవర్గంలోని సుమారు 50 మంది లబ్ధిదారులకు రూ.28.73 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ ప్రభాకర్రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో సబ్బండ వర్ణాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని కొనియడారు. ఆపదలో ఉన్నా పేదలకు సీఎంఆర్ఎఫ్ మరింత భరోసాగా నిలిచిందన్నారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగించుకుని ప్రజలు అభివృద్ధి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కొత్త పుష్పలత, జడ్పీటీసీ రవీందర్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ లక్ష్మణ్రావు తదితరులున్నారు.
ఇవి కూడా చదవండి..
ధోనీ ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పిన చెన్నై సూపర్ కింగ్స్
TRS |టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి నామినేషన్ల సందడి
ప్రజలారా వానలతో జర పైలం: కేరళ సీఎం