దుండిగల్, జూలై 27: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గండిమైసమ్మ -మియాపూర్, బహదూర్పల్లి- మియాపూర్ రహదారి విస్తరణ పనులను సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ గత దశాబ్ధకాలంగా అటవీశాఖ అనుమతులు లభించక విస్తరణ పనులు నిలిచిపోయాయని, ఇటీవల క్లియరెన్స్ రావడంతో రూ.270కోట్ల వ్యయంతో రహదారి విస్తరణ పనులను చేపట్టినట్లు తెలిపారు. ఈ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గనుందన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ మనుచౌదరి, సీఎంసీ కమిషనర్ సృజన, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్కుమార్, దుండిగల్ డీసీ డా.ఎస్.వెంకట మణికరణ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కొలన్ హన్మంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.