హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని ప్రతిపాదిస్తూ తెలంగాణ భవన్లో ఆదివారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రుల తరఫున మంత్రి మహమూద్ అలీ, ఎంపీల తరఫున కేకే, ఎమ్మెల్యేలు తరపున లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యవర్గం తరపున తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్సీల తరఫున భాను ప్రకాష్ రావు ప్రతిపాదించారు. మిగతా వారంతా బలపరిచారు.
నామినేషన్ దాఖలు చేసిన వారిలో మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్రావు, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, అజయ కుమార్, ఎంపీలు కేశవరావు, రంజిత్ రెడ్డి, రాములు, బండ ప్రకాష్, వెంకటేష్ నేత, లక్ష్మీ కాంతారావు, నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, ఎమ్మెస్ ప్రభాకర్, శంభీపూర్ రాజు, భాను ప్రసాదరావు, నవీన్, సురభి వాణీ దేవి, లక్ష్మీనారాయణ, దయానంద్, తేరా చిన్నపరెడ్డి, దామోదర్ రెడ్డి, ఫారుఖ్ హుస్సేన్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రవీంద్రనాథ్రెడ్డి, కాలే యాదయ్య, జైపాల్ యాదవ్, దానం నాగేందర్, మెతుకు ఆనంద్, రేఖా నాయక్, మాగంటి గోపీనాథ్, టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మెట్టు శ్రీనివాస్ బండి రమేష్, తాడూరి శ్రీనివాస్ ఉన్నారు.