నిజామాబాద్ : జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా చిత్రా మిశ్రా బాధ్యతలు చేపట్టారు. సోమవారం కలెక్టరేట్లో ఇంతవరకు జిల్లాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా పనిచేసిన బీఎస్ లత నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఆమె 2019 బ్యాచ్కు చెందిన తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ఇంతకుముందు చిత్రా మిశ్రా నాగర్ కర్నూల్ జిల్లాలో ట్రెయినీ అసిస్టెంట్ కలెక్టర్గా పని చేశారు. ఆమెకు నిజామాబాద్ మొదటి పోస్టింగ్. కాగా, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ చిత్రా మిశ్రాకు పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో మెప్మా పీడీ రాములు, డీపీవో జయసుధ, ఏవో సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : భార్యను చంపి భర్త ఆత్మహత్య
పీవీకి సముచిత గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్
పీవీకి ఘన నివాళులు అర్పించిన మంత్రి ఎర్రబెల్లి
హ్యాట్రిక్ గోల్డ్మెడల్స్.. ఆర్చరీ రికర్వ్లో వరల్డ్ నంబర్ వన్ దీపికా
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం