CM Revanth Reddy | మెదక్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని, బ్రిటిష్ జనతా పార్టీ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మతాలు, జాతుల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని దోచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. శుక్రవారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన జాతర సభలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకే 400 సీట్లు కావాలని బీజేపీ నేతలు అంటున్నారని విమర్శించారు. ‘మేమిద్దరం.. మాకు ఇద్దరు’ అన్నట్టు మోదీ, అమిత్షాకు అదానీ, అంబానీ తోడయ్యారని ఆరోపించారు. నల్ల చట్టాలపై కొట్లాడిన రైతులపై మోదీ పగపట్టారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రైతులను అదానీ, అంబానీలకు బానిసలుగా మార్చాలని చూస్తున్నారని విమర్శించారు.
నియమావళిని ఉల్లంఘించిన సీఎం
సీఎం రేవంత్రెడ్డి పెద్దశంకరంపేటలో నిర్వహించిన సభలో హామీలిచ్చి చి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. ఇంటర్ విద్యార్థుల కోసం మహిళా పాలిటెక్నిక్ కళాశాల, ఐటీఐ, పీజీ కళాశాల, ఇండస్ట్రియల్ క్లస్టర్, ప్రాంతీయ పారిశ్రామీకరణ కేంద్రం ఏర్పాటు, సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు పెద్దశంకరంపేటలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తానని రేవంత్రెడ్డి ప్రకటించారు.