మహబూబ్నగర్ :శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సామాన్య పౌరుడి నుంచి ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తుల దాకా రక్షణ కల్పించడానికి పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుంది. మా విధి నిర్వహణను కించపరుస్తూ, అసభ్యకరంగా మాట్లాడిన రాఘవేందర్ రాజు అలియాస్ రఘు పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారుల సంఘ అధ్యక్షుడు ఎమ్.వెంకటయ్య అన్నారు.
ఈ నెల 22 న స్థానిక ప్రెస్ క్లబ్లో కొందరు జరిపిన సమావేశంలో రాఘవేందర్ రాజు అనే వ్యక్తి, మహబూబ్నగర్ రూరల్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడడం పట్ల పోలీసు సంఘం తీవ్రంగా ఖండించింది. పౌరుల, ప్రజల, ప్రభుత్వ ఆస్తుల రక్షణ నిమిత్తం తాము వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో వ్యక్తిగత ఆలోచనలు, అభిప్రాయాలకు తావుండదని తెలిపారు.
పోలీసు విధుల పట్ల, పోలీసు అధికారి గురించి అసభ్యంగా మాట్లాడడం పోలీసు శాఖను కించపరచడం పట్ల సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక రూరల్ పోలీసు స్టేషన్లో ఈరోజు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
ప్రజల రక్షణ కోసం పోలీసు శాఖ ఎల్లవేళలా కష్టపడుతుందన్నారు. ప్రజల అభిమానంతోనే తాము ఉత్సాహంగా పని చేస్తున్నామని వెంకటయ్య వివరించారు. సమావేశంలో పోలీసు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
బైక్ను ఢీ కొట్టిన కారు..ఎనిమిదేండ్ల బాలుడు మృతి
రాష్ట్రంలో భారీ ఎత్తున స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు
దళిత సాధికారిక పథకాన్ని హర్షిస్తూ పాదయాత్ర
దళితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి
మానవత్వం చాటుకున్న ఎస్పీ రాహుల్ హెగ్డే
దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి