జోగులాంబ గద్వాల : దళితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. పేద దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలను ప్రకటించినందుకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో దళిత సంఘం నాయకులు జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..టీఆర్ఎస్తోనే తోనే దళితుల అభివృద్ధి సాధ్యమన్నారు. దళితుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ నగర్ యూత్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో భారీ ఎత్తున స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు
దళిత సాధికారిక పథకాన్ని హర్షిస్తూ పాదయాత్ర
తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి