ఖమ్మం : దళిత వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ నడుంబిగించారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. దళిత ఎంపవర్మెంట్ పథకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం అంబేద్కర్ సెంటర్లో డప్పుల దరువు, మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడారు.
దళితులు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేసేందుకే దళిత సాధికారత పథకమన్నారు. ఈ పథకం పట్ల అన్నివర్గాల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతుందన్నారు. దళిత జాతికి ఈ పథకం లక్ష్యాలు చేరాలి. దళితులు లక్షాధికారులు కావాలన్నారు. దళితుల అభ్యున్నతికై సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం ఎంతో గొప్పదని మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో భారీ ఎత్తున స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు
దళిత సాధికారిక పథకాన్ని హర్షిస్తూ పాదయాత్ర
తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు