నల్లగొండ : దళిత బాంధవుడు సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళిత సాధికారిక పథకాన్ని హర్షిస్తూ నకిరేకల్ నియోజకవర్గంలోని కేతేపల్లి నుంచి దళిత సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్కు పాదయాత్రను చేపట్టారు. ఈ పాదయాత్రను కేతేపల్లి మండల కేంద్రంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. పాదయాత్రను తలపెట్టిన దళిత సంఘాల నాయకులను ఆయన అభినందించారు. అట్టడుగున ఉన్న దళితులను తలెత్తుకుని బతికేలా సీఎం కేసీఆర్ దేశ చరిత్రలో గొప్ప అడుగు వేశారని తెలిపారు. దళిత సమాజాన్ని అభివృద్ధి దశలోకి నడిపేందుకు కేసీఆర్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోందని ఆయన తెలిపారు.