జనగామ : దివ్యాంగుల సంక్షేమానికి కృషిచేస్తూ.. రాష్ట్ర బడ్జెట్ లో పెద్దపీట వేసి ప్రాధాన్యత కల్పించిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం పాలకుర్తి నియోజకవర్గంలోని 119 మంది దివ్యాంగులకు 37 వేల విలువైన బ్యాటరీ ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..
ప్రభుత్వం దివ్యాంగులకు రాష్ట్ర బడ్జెట్ లో పెద్దపీట వేసిందన్నారు. సీఎం కేసీఆర్ దివ్యాంగుల సంక్షేమానికి నెలకు150 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారని తెలిపారు. అలాగే ఉద్యోగ అవకాశాల్లో 4 నుంచి 5 శాతానికి పెంచారని గుర్తు చేశారు. అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాల్లో వికలాంగులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. హరితహారాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నారు. అలాగే నియోజకవర్గంలో విద్యారంగం అభివృద్ధికి విద్యార్థుల శాతాన్ని బట్టి మండలానికి ఐదు ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంటానని హామీనిచ్చారు.
పారిశుధ్య నిర్వహణలో పక్కాగా ప్రణాళికలు అమలు చేసి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
తాగునీటి ట్యాంక్ లను శుభ్రపరిచి క్లోరినేషన్ చేయాలి. లీకేజీలు ఉన్న పైప్లైన్లు, నళ్లాలను సరిచేయాలన్నారు. సీజన్ వ్యాధులు ప్రబల తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే మన రాష్ట్రం ఉపాధి హామీ అమలులో మొదటి స్థానంలో ఉంది. పూర్తిస్థాయిలో ఉపాది కల్పించడానికి లేబర్ కాంపోనెంట్ ను గరిష్టంగా వినియోగించుకోవాలి. అందుకు తగిన చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో భారీ ఎత్తున స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు
దళిత సాధికారిక పథకాన్ని హర్షిస్తూ పాదయాత్ర
దళితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి
మానవత్వం చాటుకున్న ఎస్పీ రాహుల్ హెగ్డే