(Medaram Jathara) హైదరాబాద్: మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడిపేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) సిద్ధమైంది. మేడారం జాతరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 3,845 ప్రత్యేక బస్సులను నడపనున్నది. ఈ స్పెషల్ బస్సులు ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు అందుబాటులో ఉంటాయి. గత ఏడాది జాతరకు 21 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేసిన అధికారులు అందుకు తగినట్లుగా స్పెషల్ బస్సులు నడిపారు.
జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతుండగా, టీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్ నుంచి 2,250 బస్సులను నడపనున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి రెండు ఏసీ బస్సులు వేశారు. బస్సులు నిలిపేందుకు 50 ఎకరాల్లో బస్టాండ్ను నిర్మిస్తున్నారు. ఇటీవలనే మంత్రి సత్యవతి రాథోడ్ జాతర పనులను పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమ్మక్క, సారలమ్మల దర్శనం కల్పించాలని అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి మేడారం వరకు తగిన సంఖ్యలో బస్సులు నడపాలని టీఎస్ ఆర్టీసీ అధికారులకు ఆమె సూచించారు. దాంతో దీనిపై చర్చించిన ఆర్టీసీ అధికారులు గత ఏడాది మాదిరిగానే 3,845 బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు.
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..