నిజామాబాద్ : ఇద్దరు జర్నలిస్టులను కరోనా మహమ్మారి బలిగొన్నది. డిచ్పల్లి టీవీ5 రిపోర్టర్ వేణుగోపాల్, ధర్పల్లి సాక్షి రిపోర్టర్ శేఖర్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, వీరిద్దరూ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. వారం రోజుల క్రితం వీరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. హోం ఐసోలేషన్లో ఉంటూ జాగ్రత్తలు పాటించారు. కానీ రెండు, మూడు రోజుల క్రితం వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. చివరకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. జర్నలిస్టుల మృతిపట్ల ఇతర జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..