కోల్కతా: పశ్చిమబెంగాల్లో కరోనా కేసులు పెరుగుతుండంతో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నది. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి బెంగాల్కు వచ్చే వారికి కరోనా నెగెటివ్ నివేదిక తప్పనిసరి చేస్తున్నది. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తెలంగాణ నుంచి వచ్చే ప్రయాణికులు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.
తాజాగా కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి విమానాల్లో వచ్చేవారు కరోనా నెగెటివ్ రిపోర్టు చూపించాలని ప్రకటించింది. ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర విమానాయన శాఖకు సమాచారం అందించింది. ఈ నిబంధన ఏప్రిల్ 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. రాష్ట్రంలో నిన్న 12,876 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో 59 మంది మరణించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..