మేడారంలోని జంపన్నవాగు ప్రాంతంలో బుధవారం రాత్రి విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సుమారు 20 నిమిషాలపాటు జంపన్నవాగు నుంచి కన్నెపల్లి మలుపు వద్ద గల స్తూపం వరకు పూర్తిగా అంధకారంగా మారింది.
వన జాతరకు తెరలేచింది. డప్పుచప్పుళ్లు, ఒగ్గు కళాకారుల నృత్యాలు, శివసత్తుల పూనకాల నడుమ కుంకుమ భరిణె రూపంలో ఉన్న సారలమ్మ బుధవారం సాయంత్రం గద్దెనెక్కడంతో సందడి మొదలైంది.
వనదేవతలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం బుధవారం జనసంద్రమైంది. అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే గాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసింది.
మేడారం మహా జాతరలో వైద్య సిబ్బంది సేవా భావంతో విధులు నిర్వర్తిస్తూ, భక్తులకు వేగవంతమైన సేవలు అందించి జాతరను విజయవంతం చేయాలని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ రవీందర్నాయక్ అన్నారు.
వచ్చే ఫిబ్రవరిలో జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మల మహాజాతర అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మంత్రి పీఆర్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మేడారం మహాజాతర సంద�
మేడారం మహాజాతర 2024 సమయం తరుముకొస్తోంది. మరో 68 రోజుల్లో ఉత్సవం ప్రారంభం కానుంది. హైదరాబాద్, హనుమకొండ వైపు నుంచి లక్షలాది మంది భక్తులు జాతీయ రహదారి-163 మీదుగా మేడారం జాతరకు వస్తుంటారు. అయితే దామెర నుంచి గట్టమ్�
ఆదివాసీ గిరిజన దైవం మేడారం సమ్మక్క దేవత ప్రధాన పూజారి సిద్దబోయిన లక్ష్మణ్రావు (48) అనారోగ్యంతో గురువారం ఉదయం మరణించాడు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురికాగా చికిత్స పొందాడు. బుధవారం రాత్రి జ్వరం తీవ్రమై ఆరోగ