తాడ్వాయి, అక్టోబర్ 5: ఆదివాసీ గిరిజన దైవం మేడారం సమ్మక్క దేవత ప్రధాన పూజారి సిద్దబోయిన లక్ష్మణ్రావు (48) అనారోగ్యంతో గురువారం ఉదయం మరణించాడు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురికాగా చికిత్స పొందాడు. బుధవారం రాత్రి జ్వరం తీవ్రమై ఆరోగ్యం విషమించడంతో గురువారం ఉదయం మృతిచెందాడు.
ఈయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. లక్ష్మణ్రావు మృతి పట్ల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పూజారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. లక్ష్మణ్రావు కుటుంబాన్ని ములుగు జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి, ఎమ్మెల్యే సీతక్క పరామర్శించి ఓదార్చారు.