వన జాతరకు తెరలేచింది. డప్పుచప్పుళ్లు, ఒగ్గు కళాకారుల నృత్యాలు, శివసత్తుల పూనకాల నడుమ కుంకుమ భరిణె రూపంలో ఉన్న సారలమ్మ బుధవారం సాయంత్రం గద్దెనెక్కడంతో సందడి మొదలైంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 60 చోట్లకు పైగా జాతరలు ఘనంగా ప్రారంభంకాగా, ప్రధానంగా రేకుర్తి, కేశవపట్నం, హుజూరాబాద్ శివారులోని రంగనాయకులగుట్ట, వీణవంక, గోదావరిఖని, గోలివాడ, నీరుకుల్ల, కొలనూర్, హన్మంతునిపేట, జాతర్లకు పోటెత్తారు.
కాగా, మొదటి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. నేడు తల్లి సమ్మక్క గద్దెలపైకి రానుండగా, జనం పోటెత్తనున్నారు. కాగా, కోనరావుపేట శివంగాళపల్లిలో విప్ ఆదిశ్రీనివాస్, రామగుండంలో ఎమ్మెల్యే మక్కాన్సింగ్, చొప్పదండిలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు.
– కరీంనగర్ కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 21