న్యూఢిల్లీ : చమురు కంపెనీలు మరోసారి వాహనదారులకు షాక్ ఇచ్చాయి. రెండు రోజుల విరామం అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలను శుక్రవారం మరోసారి పెంచాయి. ఇంధన ధరలు ఇప్పటికే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయికి చేరగా.. తాజాగా పెట్రోల్పై లీటర్కు 19 పైసలు, డీజిల్పై 30 పైసల వరకు పెంచాయి. కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.04, డీజిల్ రూ.83.80కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబై నగరంలో దాదాపు వందకు చేరింది. లీటర్ పెట్రోల్ రూ.99.32, డీజిల్ రూ.91.01కు పెరిగాయి. చెన్నైలో పెట్రోల్ రూ.94.71 డీజిల్ రూ.88.62, కోల్కతాలో పెట్రోల్ రూ.93.11, డీజిల్ రూ.86.64, హైదరాబాద్లో రూ.96.70, డీజిల్ రూ.91.36, జైపూర్లో పెట్రోల్ రూ.100, డీజిల్ రూ.93.13కు చేరాయి.
ఇప్పటికే రాజస్థాన్ శ్రీగంగానగర్లో లీటర్ పెట్రోల్ రూ.104 మార్క్ను చేరింది. మే నెలలో ఇప్పటి వరకు 11 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఇప్పటి వరకు పెట్రోల్పై దాదాపు రూ.2.65, డీజిల్పై రూ.3పైగా పెంచాయి. గతేడాది మార్చి నుంచి ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచినప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ ధర రూ.23, డీజిల్ రూ.21పైగా పెరిగాయి. పెట్రోల్ రిటైల్ అమ్మకపు ధరలో 60 శాతం, డీజిల్లో 54 శాతానికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై లీటరుకు రూ.32.90, డీజిల్పై రూ .11.80 వసూలు చేస్తోంది.