ప్రైవేట్ పాఠశాలల సిబ్బంది వివరాలు సేకరించాలి
నెలకు రూ. 2వేలు, 25 కిలోల బియ్యం పంపిణీ
మంత్రులు సబితా రెడ్డి, గంగుల
వీడియో కాన్ఫరెన్స్లో ఉమ్మడి జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశం
ఎదులాపురం/నిర్మల్ టౌన్, ఏప్రిల్ 9 : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బందికి నెలకు రూ.2వేల ఆర్థికసాయంతో పాటు 25 కిలోల బియ్యం పంపిణీ చేయాలని కలెక్టర్లకు రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు డాక్టర్ రాజీవ్ శర్మ సూచించారు. హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్ నుంచి శుక్రవారం ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మా నవీయ కోణంతో ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్య మంత్రి కేసీఆర్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సంబంధిత కలెక్టర్లు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని, అర్హులను గుర్తించాలన్నారు. విద్యాశాఖ రూపొందించిన వివరాలను ఈ నెల 10 నుంచి 15వ తేదీ మధ్య సంబంధిత జిల్లాలకు అందజేయనున్నదని తెలిపారు. 16 నుంచి 19వ తేదీ మధ్య ఆ వివరాల పరిశీలన, గుర్తింపు ఉంటుందన్నారు.
20 నుంచి 24వ తేదీల మధ్య వారి బ్యాం క్ ఖాతాల్లో ఆర్థిక సాయం జమఅవుతుందని వెల్లడించారు. అలాగే రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ ఉంటుందని తెలిపారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే దాకా ఈ కార్యక్రమం అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం మం త్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఇప్పటికే ఆయా మండల కేంద్రాల్లో బియ్యం నిల్వలు సిద్ధంగా ఉంచామన్నారు. వాటిని పంపిణీకి వాడుకోవాల్సిందిగా కలెక్టర్లకు సూచించామని తెలిపారు. అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శ ర్మ మాట్లాడుతూ.. సంబంధిత ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ అందేలా చర్యలు చేపట్టాలని సూ చించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ ఎం డేవిడ్ మాట్లాడుతూ.. జిల్లాలో 142 ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు ఉ న్నాయని, 1465 మంది ఉపాధ్యాయులు, 544 మంది ఇతర సిబ్బంది పనిచేస్తున్నారని వెల్లడించారు.
గతేడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో అటెండెన్స్ రోల్స్ ఆధారంగా వివరాలు సేకరించినట్లు తెలిపారు. అలాగే అదనంగా డ్రైవర్లు, క్లీనర్లుగా పనిచేస్తున్న వారిని కూడా గుర్తించి నివేదిక సమర్పిస్తామని చెప్పారు. పాఠశాల వెబ్సైట్ యూ డైస్ లో నమోదైన ఉపాధ్యాయుల వివరాలను సేకరించామన్నారు. అలాగే నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ మాట్లాడుతూ.. జిల్లాలో 207 గుర్తింపు పొందిన పాఠశాలలున్నాయన్నారు. అందులో 2800 మంది ఉపాధ్యాయులు, 150 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, డీఈవోలు రవీందర్రెడ్డి, టామ్నె ప్రణీత, పౌర సరఫరాల అధికారులు సుదర్శనం, కిరణ్కుమార్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డికి కరోనా
ప్రైవేటు టీచర్ల ఆర్థికసాయం పంపిణీకి ముసాయిదా మార్గదర్శకాలు
ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన వద్దు
కొత్తగా 4 కొవిడ్ కేర్ కేంద్రాల ఏర్పాటు