వికారాబాద్ : జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో శుక్రవారం చైర్పర్సన్ పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేసుకోవాలని ఆమె సూచించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్లో ఉంటున్నట్లు తెలిపారు.
తనను కలవడానికి ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి