ధరూర్ ( జోగులాంబ గద్వాల ) : జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ( Alumni Reunion ) ఉల్లాసంగా,ఉత్సాహంగా కొనసాగింది. 1993- 94 పదో తరగతికి చెందిన విద్యార్థులంతా కలసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
32 ఏళ్ల అనంతరం తిరిగి అదే పాఠశాలలో సమావేశాన్ని ఏర్పాటుచేసుకుని తమ వ్యక్తిగత, కుటుంబ,ఆరోగ్య వివరాలను ఒకరినొకరు సంతోషంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చదువు చెప్పిన గురువులను సన్మానించుకుని గురుభక్తిని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో పూర్వ ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు , ఉపాధ్యాయులు విజయ్ బాబు , వెంకటరాములు , శ్రీనివాసరావు , లక్ష్మిరెడ్డి , గురురాజా రావు ,శ్రీనివాస్, ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు నరేష్, పూర్వ విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.