హైదరాబాద్ : నగరంలో కొత్తగా నాలుగు కొవిడ్ కేర్ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
బేగంపేటలోని ప్రకృతి చికిత్సాలయం, ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, చార్మినార్లోని
నిజామియా టీబీ ఆసుపత్రి, మెహదీపట్నంలోని సరోజినీ కంటి ఆసుపత్రిలో కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు కొవిడ్ కేర్ సెంటర్ల కోసం రూ.1.79 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి