Digestion Problem | ప్రస్తుతం అన్ని వయసుల వారినీ వేధిస్తున్న సమస్య అజీర్ణం. బిర్యానీ, బజ్జీ, పకోడీ లాంటివి తింటే చాలు.. గ్యాస్, అజీర్ణం, కడుపులో మంట తదితర జీర్ణ సంబంధ సమస్యలు మొదలవుతాయి. ఈ ఇబ్బందులకు ఆయుర్వేదం సూచించిన ఐదు పరిష్కారాలు..
♦ ముల్లంగి రసం కడుపు మంట తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. దీనిలోని ఫైబర్ ఆహారం తేలికగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
♦ పుదీనా కూడా చక్కని పరిష్కారమే. పుదీనా ఆకులు, రసం ఎలా తీసుకున్నా సమర్థంగా పనిచేస్తాయి. కడుపులో ఉబ్బరంగా ఉన్నప్పుడు కొన్ని పుదీనా ఆకులను సన్నగా తరిగి నీటిలో కలిపి తాగితే ఉపశమనం లభిస్తుంది.
♦ అర టీస్పూన్ చొప్పున వాము, జీలకర్రను గ్లాసెడు నీళ్లలో రాత్రంతా నానబెట్టి ఉదయం లేవగానే పరగడపున ఆ నీటిని తాగితే జీవక్రియ మెరుగవుతుంది.
♦ కడుపులో మంటగా ఉన్నప్పుడు చల్లని పాలు తాగడమూ ఉత్తమమే. పాలలోని క్యాల్షియం కడుపులో విడుదలయ్యే ఆమ్లాల తీవ్రతను తగ్గిస్తుంది.
♦ గులాబీ రెక్కలు వేసి మరిగించిన పాలను రోజూ తాగడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి.
ఈ ఫుడ్ తింటే అలర్జీలు అవుతున్నాయా? అయితే జాగ్రత్త !!”
Diabetes | ఇలా చేస్తే డయాబెటిస్ తగ్గిపోతుందట !!”
ఆస్తమాకు వ్యాక్సిన్ ఉందా? చేపమందుతో ఉబ్బసం పోతుందా?”
Buddha Diet | బౌద్ధులు తినే భోజనం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా!!”