IND vs ZIM : పొట్టి ప్రపంచ కప్ విజేత టీమిండియా రెండు వారాల వ్యవధిలోనే మరో సిరీస్ పట్టేసింది. జింబాబ్వే పర్యటనలో మరో మ్యాచ్ ఉండగానే యువ భారత్ టీ20 ట్రోఫీ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన నాలుగో టీ20లో ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(93 నాటౌట్), శుభ్మన్ గిల్(58 నాటౌట్)లు ఆతిథ్య జట్టు బౌలర్లకు చుక్కలు చూపించారు. తొలి ఓవర్ నుంచే బౌండరీలతో విరచుకుపడ్డ ఈ జంట రికార్డు భాగస్వామ్యంతో టీమిండియాను గెలుపు బాట పట్టించింది. దాంతో, 10 వికెట్లతో గెలిచిన గిల్ సేన 3-1తో సిరీస్ దక్కించుకుంది.
టీమిండియా కుర్రాళ్లు పొట్టి సిరీస్లో తమ ప్రతాపం చూపించారు. ఆతిథ్య జింబాబ్వే నిర్దేశించిన 153 పరుగుల ఛేదనలో ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(93 నాటౌట్), శుభ్మన్ గిల్(58 నాటౌట్)లు బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరచుకుపడ్డారు. బౌలర్ మారినా బంతి వెళ్లాల్సిందే బౌండరీయే అన్నట్టు చితక్కొట్టారు. దాంతో, మరో నాలుగు ఓవర్లు ఉండగానే టీమిండియా జయకేతనం ఎగురవేసింది.
A sparkling 🔟-wicket win in 4th T20I ✅
An unbeaten opening partnership between Captain Shubman Gill (58*) & Yashasvi Jaiswal (93*) seals the series for #TeamIndia with one match to go!
Scorecard ▶️ https://t.co/AaZlvFY7x7#ZIMvIND | @ShubmanGill | @ybj_19 pic.twitter.com/xJrBXlXLwM
— BCCI (@BCCI) July 13, 2024
తొలి ఓవర్లోనే యశస్వీ 15 పరుగులు పిండుకొని తన ఉద్దేశం చాటగా.. గిల్ సైతం దూకుడుగా ఆడాడు. దాంతో, స్కోర్ బోర్డు పరుగులు పెట్టగా.. జింబాబ్వే ఫీల్డర్లు బౌండరీ లైన్కు పరుగులు పెట్టారు. 29 బంతుల్లోనే యశస్వీ అర్ధ సెంచరీ సాధించాడు. కెప్టెన్ గిల్ కూడా మెరుపు ఫిఫ్టీతో జింబాబ్వే ఆటగాళ్లను అసహనానికి గురి చేశాడు. ముజరబనీ వేసిన 16వ ఓవర్ రెండో బంతికి యశస్వీ బౌండరీ కొట్టడంతో10 వికెట్ల విజయం నమోదు చేసింది.
Talk about making a cracking start! 👌 👌
A quickfire 5⃣0⃣-run stand between captain Shubman Gill & Yashasvi Jaiswal! ⚡️ ⚡️
Follow The Match ▶️ https://t.co/AaZlvFY7x7#ZIMvIND pic.twitter.com/kENoecQMTf
— BCCI (@BCCI) July 13, 2024
సొంతగడ్డపై పొట్టి సిరీస్లో వెనకబడిన జింబాబ్వే నాలుగో టీ20లో పోరాడగలిగే స్కోర్ చేసింది. గత రెండు మ్యాచుల్లో భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన బ్యాటర్లు పట్టుదలగా ఆడారు. ఓపెనర్లు తడివనషె మరుమని(32), వెస్లీ మధెవెరె(25)లు శుభారంభమివ్వగా.. సికిందర్ రజా(0) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి స్కోర్ బోర్డును నడిపించాడు.

అయితే భారత బౌలర్లు వరస విరామాల్లో వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టును కట్టడి చేశారు. చివర్లో డియాన్ యెర్స్(13), కల్ఐవ్ మడండే(7)లు పోరాడడంతో జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 రన్స్ కొట్టింది. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. దాంతో, ఆతిథ్య జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 రన్స్ కొట్టింది.