అమరావతి : ఆంధ్రప్రదేశ్లో 37 మంది ఐపీఎస్ల (IPS Traffers ) ను బదిలీ చేశారు. శనివారం సాయంత్రం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary) నీరబ్ కుమార్ ప్రసాద్ బదిలీ ( Neerab Kumar) ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా కె.వి మహేశ్వర్రెడ్డి, విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్, అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఎం. దీపిక, సత్యసాయి జిల్లా (Satyasai District) ఎస్పీగా వి. రత్న, పార్వతీపురం మన్యం జిల్లా జిల్లా ఎస్పీగా ఎస్.వి . మాధవరెడ్డిని బదిలీ చేశారు.
కాకినాడ జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్, గుంటూర్ జిల్లా ఎస్పీగా ఎస్. సతీష్కుమార్, అల్లూరి జిల్లా ఎస్పీగా అమిత్ బర్దార్, విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్-1 గా అజిత వేజెండ్ల, కమిషనర్-2గా తుహిన్ సిన్హాను నియమించారు. పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా అద్నాన్ నయీమ్ ఆస్మీ, తూర్పుగోదారి జిల్లా ఎస్పీగా డి. నరసింహ కిషోర్, అన్నమయ్య జిల్లా ఎస్పీగా వి. విద్యాసాగర్ నాయుడు, కోనసీమ జిల్లా ఎస్పీగా బి.కృష్ణారావు (Krishan rao)ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కృష్ణా జిల్లా ఎస్పీగా గంగాధర్రావు, ఏలూరు జిల్లా ఎస్పీగా కె. ప్రతాప్ శివకిషోర్, పల్నాడు జిల్లా ఎస్పీగా కె.శ్రీనివాసరావు, ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్గా మల్లికా గార్గ్ను బదిలీ చేశారు . ప్రకాశం జిల్లా ఎస్పీగా ఎ.ఆర్ దామోదర్, కర్నూలు జిల్లా ఎస్పీగా జి.బిందుమాధవ్(Bindumadav) , నెల్లూరు జిల్లా ఎస్పీగా జి. కృష్ణాకాంత్ , నంద్యాల జిల్లా ఎస్పీగా అధిరాజ్ సింగ్ రానాను నియమించారు.
కడప జిల్లా ఎస్పీగా వి. హర్షవర్దన్ రాజు, అనంతపురం జిల్లా ఎస్పీగా కె.వి. మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్. సుబ్బారాయుడు, ఎర్రచందనం టాస్క్ఫోర్స్ ఎస్పీగానూ సుబ్బారాయుడుకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్గా , శాంతి భద్రతలు గౌతమీ శాలి, ఇంటెలిజెన్స్ అడ్మిన్ ఎస్పీగా వి. గీతాదేవిని నియమించారు. ఐపీఎస్లు రఘవీరారెడ్డి, సిద్ధార్థ్, కౌశల్ , సుమిత్ సునీల్, పి. జగదీశ్, ఎస్.శ్రీధర్, సత్తిబాబు, రాధిక, మేరి ప్రశాంతి, ఆరీఫ్ ఆఫీజ్కు డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించారు.