న్యూఢిల్లీ : (Sushil Kumar) ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన హత్య కేసులో ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సుశీల్ కుమార్ ఢిల్లీ కోర్టు మంగళవారం బెయిల్ నిరాకరించింది. ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వాదనలు విన్న తర్వాత అదనపు సెషన్స్ జడ్జి శివాజీ ఆనంద్.. సుశీల్ కుమార్కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. పోలీసులు తనపై తప్పుడు కేసు బనాయించారని, తనను అపరాధిగా చిత్రీకరించారని రెజ్లర్ సుశీల్ కుమార్ కోర్టుకు తెలిపి.. బెయిల్ ఇవ్వాల్సిందిగా విన్నవించారు.
38 ఏండ్ల వయసున్న సుశీల్ కుమార్ తోటి మాజీ జూనియర్ రెజ్లింగ్ ఛాంపియన్ సాగర్ ధంకర్ను కొట్టి చంపాడన్న ఆరోపణలపై మే 23 న పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం జూన్ 2 నుంచి జైలులో ఉన్నాడు. సుశీల్కుమార్-సాగర్ ధంకర్ మధ్య ఆస్తికి సంబంధించి వాగ్వాదం జరుగడంతో సాగర్పై సుశీల్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సాగర్ ధంకర్ దవాఖానలో చికిత్స పొందుతూ మరణించాడు. సెరిబ్రల్ డ్యామేజ్ కారణంగా సాగర్ ధంకర్ చనిపోయాడని పోస్ట్మార్టం నివేదిక వెల్లడించింది.
2000-2020 మధ్య డిగ్రీలు చెల్లవు : తాలిబాన్ విద్యా మంత్రి
మీరు 30 దాటిన మహిళలా? అయితే, ఈ 6 పరీక్షలు తప్పనిసరి..!
చైనాలో డ్రోన్ల వర్షం.. లైట్షోలో ఘటన
కుప్పకూలిన వేలాడే వంతెన : 30 మంది విద్యార్థులకు గాయాలు
అణు రియాక్టర్ల నిర్మాణ ప్రణాళికలు ప్రస్తుతానికి లేవు : జపాన్
చార్ధామ్ భక్తుల సంఖ్య పరిమితి ఎత్తివేసిన హైకోర్ట్
13 మంది హజారాలను చంపిన తాలిబాన్ : హక్కుల సంఘం ఆరోపణ
షూటింగ్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్కు ‘గోల్డ్’
వీరనారి రాణి దుర్గావతి జయంతి నేడు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..