టోక్యో : (Nuclear reactors) ప్రస్తుతానికి కొత్త న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణానికి తమ వద్ద ప్రస్తుతానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదని జపాన్ స్పష్టం చేసింది. జపాన్ పరిశ్రమల మంత్రి కోయిచి హగియుడా ఈ ప్రకటన చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాత అణు రియాక్టర్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసే ఆలోచన లేదని చెప్పారు. యోషిదే సుగా రాజీనామా చేసిన అనంతరం జపాన్ ప్రధానిగా ఫుమియో కిషిడా నియమితులయ్యారు. పరిశ్రమల మంత్రిగా కోయిచి హగియుడాను ప్రధాని కిషిడా నియమించారు.
పదేండ్ల క్రితం సునామీ, భూకంపం సంభవించడంతో జపాన్ ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్ ధ్వంసమైంది. రష్యా చెర్నోబిల్ విపత్తు తర్వాత రెండవ అతిపెద్ద అణు విపత్తు ఫుకుషిమాదే. కాగా, అణు దాడి పర్యవసానాలను కూడా ఎదుర్కొన్న ఏకైక దేశంగా జపాన్ నిలిచింది. అయితే, 2011 సునామీకి ముందు జపాన్ విద్యుత్లో 30 శాతం అణు కర్మాగారాల నుంచి ఉత్పత్తి అయింది. సునామీ సమయంలో దేశంలో 54 న్యూక్లియర్ రియాక్టర్ ప్లాంట్లు ఉండగా, వీటిలో 12 రియాక్టర్లను ప్రభుత్వం మూసివేసింది. అణు విద్యుత్ లేకుండా 2030 నాటికి దేశం కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను సగానికి తగ్గించాలనే లక్ష్యాన్ని సాధించలేమని టెప్కో ఛైర్మన్ తోమోకి కొబాయకావా చెప్పారు. అందుకని మూసివేసిన ప్లాంట్లను ప్రభుత్వం తిరిగి ప్రారంభించాలన్నారు.
చార్ధామ్ భక్తుల సంఖ్య పరిమితి ఎత్తివేసిన హైకోర్ట్
13 మంది హజారాలను చంపిన తాలిబాన్ : హక్కుల సంఘం ఆరోపణ
షూటింగ్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్కు ‘గోల్డ్’
వీరనారి రాణి దుర్గావతి జయంతి నేడు
గుండె ఆరోగ్యాన్ని కంటితో తెలుసుకోవచ్చు.. అమెరికా పరిశోధన
నీటిలో ఒలికిన నూనెను వేరుచేసే హైడ్రోఫోబిక్ కాటన్.. ఐఐటీ గువాహటి పరిశోధకుల కృషి
అమ్మల చేతితో అమ్మకు పూజలు.. కోల్కతాలో కొత్త సంప్రదాయం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..