(Rani Durgavathi) మొఘల్ రాజుల చేతిలో చావడం ఇష్టం లేని రాణి దుర్గావతి.. నడుముకు ఉన్న కత్తి తీసి ఆత్మార్పణం చేసుకుని వీరనారిగా నిలిచింది. తన చివరి శ్వాస వరకు గోండ్వానా రాజ్యాన్ని మొఘలుల చేతికి చిక్కకుండా కాపడుతూ వచ్చారు. అంతటి వీరనారిగా ప్రసిద్ధి పొందిన రాణి దుర్గావతి త్యాగనిరతికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఆమె చిత్రంతో కూడిన రూ.60 ప్రత్యేక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించింది.
రాణి దుర్గావతి 1524 అక్టోబర్ 5 న ఉత్తరప్రదేశ్లోని బండాలో జన్మించారు. ఆమె తండ్రి కిరత్ రాయ్ చండేలా రాజవంశీకుడు. దుర్గావతి బాల్యం నుంచే విలువిద్య, ఫెన్సింగ్, గుర్రపు స్వారీలో ప్రావీణ్యత సాధించింది. తండ్రితో కలిసి అడవుల్లో వేటకు వెళ్లేది. 18 సంవత్సరాల వయస్సులో ఉండగా దల్పత్ షాతో ఆమె వివాహం జరిగింది. భర్త దల్పత్ షా మరణానంతరం 5 ఏండ్ల కుమారుడు వీర నారాయణ్ను సింహాసనంపై కూర్చోబెట్టి గోండ్వానా రాజ్యం పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నారు. అనంతరకాలంలో రాజధానిని చౌరఘర్ నుంచి సింగౌర్గఢ్కి మార్చారు. సైన్యంలో పెద్ద మార్పులు తీసుకొచ్చి సుసంపన్నం చేశారు. అనేక దేవాలయాలు, ధర్మశాలలు, చెరువులను నిర్మించారు.
1556 లో మాల్వాకు చెందిన సుల్తాన్ బాజ్ బహదూర్ గోండ్వానా రాజ్యంపై దండెత్తాడు. అయితే, రాణి దుర్గావతి ధైర్యం ముందు అతను ఘోరంగా ఓడిపోయాడు. 1562 లో మాల్వాను మొఘల్ సామ్రాజ్యంలోకి అక్బర్ చేర్చుకున్నాడు. రేవాను అసఫ్ ఖాన్ ఆక్రమించాడు. మాల్వా, రేవా రెండింటి సరిహద్దులు గోండ్వానాను తాకాయి. దాంతో మొఘలులు గోండ్వానాను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు విశ్వప్రయత్నం చేసి ఓటమిపాలయ్యారు. దాంతో అసఫ్ ఖాన్ మరోసారి 1564 లో దండెత్తి రాణి దుర్గావతితో హోరాహోరీగా పోరాడాడు. ఈ యుద్ధంలో ఆమె తీవ్రంగా గాయపడింది. మొఘలుల చేతిలో చావడం ఇష్టం లేని రాణి దుర్గావతి.. తనను చంపాలని తన సైనికుడిని ఆదేశించింది. అందుకు సైనికుడు నిరాకరించడంతో.. రాణి దుర్గావతి తన నడుం భాగంలో ఉంచుకున్న చురకత్తిని తీసుకుని ఆత్మార్పణం గావించింది. ఆమె చనిపోయిన రోజును స్మరించుకుంటూ జూన్ 24 ను ‘త్యాగ దినోత్సవం’ గా నేటికీ జరుపుకుంటున్నారు.
2011 : ఐఫోన్, ఐపాడ్, మ్యాక్ వంటి సృష్టికర్త స్టీవ్ జాబ్స్ ప్యాంక్రియాస్ క్యాన్సర్తో కన్నుమూత
1989: నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న టిబెట్ 14 వ దలైలామా టెంజిన్ గయాట్సో
1988: రాజ్యాంగాన్ని ఆమెదించిన బ్రెజిల్ రాజ్యాంగ సభ
1944: ఫ్రాన్స్లో మహిళలకు లభించిన ఓటు హక్కు
1910: పోర్చుగల్లో రాచరికం రద్దు
1880: బాల్ పాయింట్ పెన్నుకు పేటెంట్ పొందిన అలోన్జో టీ క్రాస్
1796: ఇంగ్లండ్పై యుద్ధం ప్రకటించిన స్పెయిన్
1676: ముంబైలో భారతీయ కరెన్సీని తయారు చేయడానికి ఇంగ్లండ్ రాజు నుంచి హక్కును పొందిన ఈస్ట్ ఇండియా కంపెనీ
గుండె ఆరోగ్యాన్ని కంటితో తెలుసుకోవచ్చు.. అమెరికా పరిశోధన
నీటిలో ఒలికిన నూనెను వేరుచేసే హైడ్రోఫోబిక్ కాటన్.. ఐఐటీ గువాహటి పరిశోధకుల కృషి
అమ్మల చేతితో అమ్మకు పూజలు.. కోల్కతాలో కొత్త సంప్రదాయం
గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన జెఫ్ బెజోస్ ‘బ్లూ ఆరిజిన్’
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..